• తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.
• అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ములుగు జిల్లాలో ఉన్నాయి.
• రాష్ట్రంలో మొత్తం మరమగ్గాల సంఖ్య 41,556.
• తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటోంది.
• దేశంలో మొదటి చక్కెర పరిశ్రమ 1903 లో ఏర్పడింది.
• తెలంగాణలో మొదటి చక్కెర పరిశ్రమను 1937 లో స్థాపించారు.
• తెలంగాణలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ.
• తెలంగాణలో పరిశ్రమల ద్వారా 56 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీని 1981 లో స్థాపించారు.
• సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఉంది.
• చక్కెర ఉత్పత్తిలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.
• అజంజాహీ మిల్లు 1934 లో స్థాపించారు.
• అజాంజాహీ మిల్లు వరంగల్ లో స్థాపించారు. 1990 లో అజాంజాహీ మిల్లు మూతపడింది.
• సంఘీ వస్త్ర పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
• పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ మేడ్చల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్ను 1980 లో స్థాపించారు.
• సూర్యలక్ష్మి కాటన్ మిల్లు ఆమన్ గల్ ప్రాంతంలో ఉంది.
• తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు బాలానగర్ లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ 1930 లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• చార్మినార్ సిగరెటన్ను వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ తయారు చేస్తోంది.
• నటరాజ్ స్పిన్నింగ్ మిల్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్ స్పిన్నింగ్ మిల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• పట్టు వస్త్ర పరిశ్రమకు గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాలు ప్రసిద్ధి.
• రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను 1938 లో ప్రారంభించారు.
• రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్.
• ఏపీ రేయాన్స్ లిమిటెడ్ వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.
• చార్మినార్ పేపర్ మిల్స్ మాతంగి ప్రాంతంలో ఉంది.
• నాగార్జున పేపర్ మిల్స్ పటాన్ చెరువు ప్రాంతంలో ఉంది.
• దేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1932 లో స్థాపించారు.
• కాగితాన్ని అధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది.
• జమ్మికుంటలో లెదర్ పార్క్ న్ను స్థాపించారు.
• దక్షిణాసియాలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను పాల్వంచలో స్థాపించారు.
• దేశంలో మొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను జంషెడ్పూర్ లో స్థాపించారు.
• తెలంగాణలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1958 లో స్థాపించారు.
• కేశోరామ్ సిమెంట్స్ పెద్దపల్లి జిల్లాలో ఉంది.
• రాశి సిమెంట్స్ నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో ఏర్పాటు చేశారు.
• దక్కన్ సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట హుజూర్నగర్ జిల్లాలో ఉంది.
• సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం జిల్లాలో ఉంది.
• హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ సనత్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• మహా సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట జిల్లాలో ఉంది.
• తోళ్ల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
• సూర్య వంశ స్పిన్నింగ్ మిల్ భువనగిరి జిల్లాలో ఉంది.
• నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (ప్లైవుడ్ పరిశ్రమ) పటాన్చెరువు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం టీఐఎస్ సీఓ.
• 1953 లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ స్థాపించారు.
• హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దేశంలో మొదటి సారిగా బెంగళూరు ప్రాంతంలో స్థాపించారు.
• హైదరాబాద్లోని హెచ్ఎంటీలో ఎలక్ట్రిక్ బల్బులు తయారు చేస్తారు.
• ప్రాగా టూల్స్ లిమిటెడ్ కవాడిగూడ ప్రాంతంలో ఉండేది.
• సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.
• దేశంలో మొదటి సిమెంట్ కంపెనీని 1904 లో స్థాపించారు.
• పింజోర్ హెచ్ఎంటీ ప్లాంట్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
• భోపాల్ ప్రాంతంలో మొదటి భారత్ హెవీ ఎల క్ట్రిక్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు.